* కంటిచూపును మెరుగుపరిచే ఖర్జూరం..!!
నోట్లో వేసుకోగానే కరిగిపోయే ఎంతో తియ్యని ఖర్జూరాన్ని ప్రత్యేక
సందర్భాల్లో మాత్రమే కాకుండా, ప్రతిరోజూ తీసుకోవడం వల్ల కలిగే మేలు అంతా
ఇంతా కాదంటున్నారు నిపుణులు. ప్రతిరోజూ కనీసం ఒక్కటైనా తీసుకోగలిగితే ఎన్నో
సహజ పోషకాలను సులువుగా పొందవచ్చంటున్నారు.ముఖ్యంగా
ఖర్జూరాల్లో క్యాల్షియం, సల్ఫర్, ఇనుము, పొటాషియం , ఫాస్పరస్,
మ్యాంగనీస్, రాగి, మెగ్నీషియం వంటి పోషకాలు సమౄఎద్ధిగా లభిస్తాయి. ఇంకా
చెడు కొలెస్ట్రాల్ను నివారించే శక్తి కూడా వీటికి ఎక్కువగా ఉంది. అలాగే
ఇందులోని విటమిన్ ’ఎ’ కంటిచూపును మెరుగుపరుస్తుంది. ఊపిరితి త్తులు కూడా
ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. ఇనుము వల్ల రక్తహీనత సమస్య అదుపులో ఉంటుందని
చెబుతున్నారు నిపుణులు.
0 comments:
Post a Comment